end

సామ్‌ షోలో టాలీవుడ్‌ బాస్‌

స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంత హోస్ట్‌గా ‘ఆహా’ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘సామ్‌ జామ్’‌. ‘ఆహా’ తన సబ్ర్కైబర్లను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సమంతతో కొత్తగా ఈ షో చేయిస్తున్నారు. కరోనా కారణంగా ఎలాగూ సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు సామ్‌ కూడా డిజిటల్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ‘సామ్‌జామ్‌’ షోలో సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో అభిమానులకు పూర్తి వినోదాన్ని పంచనున్నారు. కాగా పూర్తిస్థాయిలో ఓ షోకు సమంత్‌ హోస్ట్‌గా చేయడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు స్టార్‌మాలో ప్రసారమైన బిగ్‌బాస్‌3కి కొన్ని ఎపిసోడ్‌లలో హోస్ట్‌గా చేసి మెప్పించారు. కాగా, సామ్‌ జామ్‌ షో నవంబర్‌13న లాంఛనంగా ప్రారంభమవ్వగా.. మొదటి ఎపిసోడ్‌లో అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చారు.

ఈ క్రమంలో సామ్‌జామ్‌లో ఓ ఎపిసోడ్‌లో మెగాస్టార్‌, టాలీవుడ్‌ బాస్‌ చిరంజీవి కూడా రానున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆహా అధినేత అల్లు అరవింద్‌కు చిరంజీవి స్వయానా బావ కావడంతో ఆయన ఈ షోలో పాల్గొంటారని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే తాజాగా చిరంజీవి సామ్‌జామ్‌ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఎపిసోడ్‌ త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది. ఇంకా మున్ముందు ఎపిసోడ్‌లలో తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్‌, కశ్యప్‌ పారుపల్లి, అల్లు అర్జున్‌ కూడా సమంత షోలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version