end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంటీఆర్ఎస్‌ ఓటమి ఖాయం: కేంద్రమంత్రి
- Advertisment -

టీఆర్ఎస్‌ ఓటమి ఖాయం: కేంద్రమంత్రి

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడం ఖాయమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. టీఆర్‌ఎస్‌ నగరంలో అనవసరపు రాద్దాంతం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని, రోహింగ్యాల విషయంలో టీఆర్‌ఎస్ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. రోహింగ్యాలపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అక్రమ చొరబాటుదారులకు టీఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతిస్తున్నాయని, అక్రమ చొరబాటుదారులు ఓటర్ లిస్టుల్లో కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ఎ న్నికల ప్రచారంలో భాగంగా ఆమె హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రోహింగ్యాలను టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి తమ రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నాయని, 75 వేల రోహింగ్యాల కుటుంబాలు హైదరాబాద్‌లో నివసిస్తున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్- ఎంఐఎంలది అవినీతి కూటమి అని, రోహింగ్యాలను ఓటర్ లిస్టులో చేర్చమని ఎంఐఎం కేంద్రానికి లేఖ కూడా రాసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎందరో మంది అమరులయ్యారని, ఆ తెలంగాణలోనే ఇప్పుడు కుటుంబ పాలన సాగుతోందని ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తూనే ఉందని, అందుకే బీజేపీ కార్యకర్తలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై అధికార టీఆర్‌ఎస్ అక్రమ కేసులు బనాయిస్తోందని, దుబ్బాకలో కూడా బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 75 వేల అక్రమ కట్టడాలు వెలిశాయని, అవన్నీ టీఆర్‌ఎస్, ఎంఐఎం భాగస్వామ్యంతోనే వెలిశాయని విమర్శించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్నదే తమ నినాదమని, ఆ నినాదంతోనే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -