end

టీఆర్‌ఎస్‌ మత రాజకీయాలు చేస్తోంది

టీఆర్ఎస్‌ పార్టీ మతరాజకీయాలు చేస్తోందంటూ మాజీ ఎంపీ, బీజేపీనేత విజయశాంతి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. గతంలో హిందువులపై విద్వేషం వెళ్లగక్కిన ఎంఐఎం నేతను కేటీఆర్ ఎందుకుప్రశ్నించలేకపోయారన్నారు. ‘ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకు?’ అంటూ ఒక ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించిన మంత్రి కేటీఆర్‌.. ఇన్నేళ్ళూ టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన ఎంఐఎం పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు గుర్తులేనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 15 నిమిషాలు వదిలిపెడితే హిందువుల జనాభా నిష్పత్తిని వారి మతస్తుల జనాభాతో సమానం చేస్తానని ఆ ఎంఐఎం నేత అన్నాడు. తన వర్గం వారంతా కలసి ఉమ్మువేస్తే చాలు చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయం కూలిపోతుందని పరిహాసం చేశాడు. హిందువులు పవిత్రంగా ఆరాధించే గోమాతను ఉద్దేశించి చులకనగా మాట్లాడాడు. ‘హిందువులపై అంత గుడ్డి ద్వేషమెందుకు?’ అని ఆ ఎంఐఎం లీడర్‌ని కేటీఆర్ ఎందుకు నిలదీయలేదు? దీన్ని బట్టి చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్ఎస్ మత రాజకీయాలకు తెగబడుతోందని స్పష్టమవుతోంది’’ అని ఆమె ట్వీట్ చేశారు.

Exit mobile version