end

TRS MLA Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు … నిందితుల రిమాండ్‌

  • ఏసీబీ కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టు
  • సైబరాబాద్‌ పోలీసుల రివిజన్‌ పిటిషన్‌కు అనుమతి
  • 24 గంటల్లో నిందితులు లొంగిపోవాలి

(TRS MLA Money Offer : ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ప్రత్యేక భద్రత)


TRS MLAs Purchase Case : : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల(TRS MLA) కొనుగోలు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలీసులు వేసిన పిటిషన్‌పై ఏసీబీ(ACB) ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. కాగా మొయినాబాద్‌లో(Moinabad) ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి (Pilot Rohit Reddy) చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు రిమాండ్‌(Remand) చేయడానికి అనుమతినిచ్చింది. 24 గంటల్లోగా నిందితులు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌(Cyberabad Police Commissioner) ఎదురుగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అలాగే నిందితులను మేజిస్ర్టేట్‌ముందు హాజరు పరచాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సైబరాబాద్‌ పోలీసులు ఇచ్చిఇన రివిజన్‌ పిటిషన్‌ (Revision Petition) ఆధారంగా రిమాండ్‌కు అనుమతినిచ్చినట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు.

Operation Farm House: సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ సైలెంట్‌ ?!

Exit mobile version