end

ఒమిక్రాన్‌ XE వైరస్‌తో ఇద్దరు మృతి

చైనాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒక్కరోజు దాదాపు 22వేలకు పైగా కరోనా ఒమిక్రాన్‌ XE వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. చాలా రోజులుగా నుండి లాక్‌డౌన్‌ నడుస్తున్నప్పటికీ షాంఘైలో తొలిసారిగా ఇద్దరు ఒమిక్రాన్‌ XE వైరస్‌తో మృతిచెందారని స్థానిక ప్రభుత్వం తెలిపింది. అలాగే గత నెలలో కూడా జిలిన్‌ ప్రావిన్స్‌లో కూడా వైరస్‌ బారిన పడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. షాంఘైలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాలా తొందరగా వ్యాప్తి చెందుతోంది. మార్చి నుండి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చైనా ప్రభుత్వం ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ వ్యాప్తిని విలువరించలేకపోతున్నారు. విస్తృత్తంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు.

పోలీసులకు సెలవులు రద్దు

భారత్‌ కొత్త ఆర్మీ చీఫ్‌ మనోజ్‌పాండే

Exit mobile version