end

జాతీయ రహదారిపై ప్రమాదం – ముగ్గురు మృతి

జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయ సురేష్‌(28), సిద్దన్నగౌడ్‌(30), చాకలి కృష్ణ(30) ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే ద్విచక్రవాహనంపై కదరంపల్లి వైపు జాతీయ రహదారి మీద వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

‘లవకుశ’లో లవుడు నాగరాజు ఇక లేరు

ఈ ప్రమాదంలో ఈ ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఈ ఘటనను చూసి వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అదించారు. వెంటనే ఎస్‌ఐ రాఘవేంద్రప్ప ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను రాయదుర్గం పిహెచ్‌సీకి తరలించారు. అయితే చికిత్సపొందుతూ కొద్దిసేపటికే ఈ ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు ఎస్‌ఐ వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ఇక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లొచ్చు

ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు

Exit mobile version