end

శభాష్ సంజయ్‌..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్రమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ విజయ‌ం సాధించడం పట్ల ఆయన విషెస్‌ తెలిపారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. సోలిపేట రామలింగారెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. తొలి నుంచి కూడా నరాలు తెగే ఉత్కంఠతో సాగిన కౌంటింగ్.. తుదకు బీజేపీనే విజయం వరించింది. తెలంగాణ బీజేపీ నాయకులంతా సమష్టిగా పోరాడి దుబ్బాకలో విజయం సాధించినందుకు షా అభినందనలు తెలియజేశారు. దుబ్బాక ఎన్నికల వేళ బండి సంజయ్‌పై దాడి సమయంలోనూ షా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న విషయం విదితమే.

Exit mobile version