end

భర్తను రోకలిబండతో కొట్టిచంపిన భార్య

  • మేడ్చల్‌ జిల్లాలో దారుణం

మేడ్చల్‌ నిత్యం మద్యం తాగి వేధిస్తున్న భర్తను భార్య హత్యచేసింది. ఈ దుర్ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్యామ్‌, సరోజ దంపతులు స్థానిక విజయ హాస్పిటల్‌ ఆవరణలోని ఎదురుగా ఉన్న స్థలంలో నివాసముంటున్నారు. శ్యామ్‌ వాచ్‌మెన్‌ డ్యూటీ చేస్తుంటాడు. అయితే శ్యామ్‌ రోజు మద్యం సేవించి భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం భార్యభర్తల మధ్య గొడవలు ఎక్కువై ఘర్షణకు దిగారు. దీంతో భార్య సరోజ రోకలిబండతో భర్త శ్యామ్‌ తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భార్య సరోజను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

Exit mobile version