end

కూతురు, అల్లుడుతో కలిసి భర్త హత్య

కట్టుకన్న భర్తనే రోకలిబండతో మోది, కత్తితో పొడిచి హత్య చేసింది ఓ భార్య. పోలీసుల వాహన తనీఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం నంద్యాల దేవనగర్‌కు చెందిన గోగుల నాగశేషు(38) మద్యానికి బానిసై తరుచూ తన భార్య శ్రీదేవితో గొడవపడేవాడు. అయితే భర్త పెట్టే హింస భరించలేక భార్య శ్రీదేవి పథకం ప్రకారం భర్త నాగశేషును హత్య చేసింది. ఇందుకు తన కూతురు లక్ష్మీ, అల్లుడు డేరంగుల మీరావలి, దగ్గరి బంధువైన సుబ్బరాయుడు సహాయం తీసుకుంది.

‘ప్రేమ’ మంటలకు తల్లీకూతుర్లు బలి

ఈ క్రమంలో ఈనెల 13న రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న నాగశేషును రోకలిబండతో మోది, కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు అల్లుడు ఆటో తీసుకుని బయలుదేరాడు. వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి ఆటో వదిలి పారిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మళ్లీ పెట్రో మంట !

Exit mobile version