end

Mallanna:మల్లన్న దయతో…..

Dubbaka: సీఎం కేసీఆర్(CM KCR) గారి చొరవతో మల్లన్న దేవాలయాన్ని అభివృద్ధి చేద్దాం. ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మల్లన్న, ఎల్లమ్మల దయతో సీఎం కేసీఆర్ తెలంగాణ(Telangana) లో సుపరి పాలన చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక మండలంలోని రేకులకుంట మల్లిఖార్జున స్వామి దేవాలయంలో ఆషాడ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈసందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో(Purnakumbha) స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాతే సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన దేవాలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. మల్లన్న దేవాలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ , మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు(Harish Rao) గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మల్లన్న పేరు మీదనే మనం మల్లన్న సాగర్ ప్రాజెక్టు(Mallanna Sagar Project) నిర్మించుకోవడం జరిగిందన్నారు. నాడు కరువు కటకాలతో అల్లడిన తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రాజెక్టుల నిర్మాణంతో పచ్చని చేలతో కళకళలాడుతుందన్నారు.

(Varalakshmi Vrata:వరలక్ష్మీ వ్రతానికి కలశం తయారీ)

Exit mobile version