end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయంJaipur:రాజస్థాన్‌లో దారుణం
- Advertisment -

Jaipur:రాజస్థాన్‌లో దారుణం

- Advertisment -
- Advertisment -

  • అత్తను చంపి 10 ముక్కలు నరికిన అల్లుడు
  • శరీర భాగాలను అడవిలో ఒక్కొక్కటిగా విసిరివేత


ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు మనుషుల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపట్ల ఒకరికి ప్రేమ అప్యాయతలనే మమకారం లేకుండా పోతుంది. కన్న బిడ్డనుంచి కట్టుకున్న వాడిదాకా నిర్ధాక్షిణ్యంగా దాడిచేసి చంపుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణమైన సంఘటన రాజస్థాన్ జైపూర్‌లో (Rajasthan Jaipur) చోటుచేసుకుంది. తన నిర్ణయాలకు అడ్డం వస్తుందనే కారణంతో అనుజ్ శర్మ (Anuj Sharma)తన మేనత్తను హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని మార్బుల్స్ కత్తిరించే మిషన్‌ (Marble cutting mission)తో 10 భాగాలు చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడవేసినట్లు పోలీసులు (Police) తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అనూజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత ఆదివారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా భయంకర వాతావరణాన్ని సృష్టించింది.

విద్యధర్‌నగర్‌లో ఉండే సరోజ్ శర్మ (Saroj Sharma from Vidhyadhar Nagar)(64) భర్త చనిపోయాడు. కూతురు పూజ (Pooja) కూడా మరణించగా, కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. దీంతో అల్లుడు అనూజ్‌ను తనతో పాటే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే ఓ విషయంలో వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో అనుజ్ ఆమెపై దాడికి పాల్పడి హతమార్చాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు బాడీని ముక్కలు చేసి సమీపంలోని అడవిలో పడేశాడు. అంతేకాకుండా సరోజ్ కనిపించకుండా పోయిందని అనూజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కిచెన్‌లో (kitchen) రక్తం (blood) మరకలు చూసిన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి అనూజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తానే చంపానని ఒప్పుకున్నాడు. ఢిల్లీ (Delhi) వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తిందని తెలిపారు. అనూజ్ ఈ మధ్యనే బిటెక్ (B-Tech) పూర్తి చేసుకున్నాడు. పోలీసులు సరోజ్ శరీర భాగాలను గుర్తించడంతో పాటు హత్యకు ఉపయోగించిన మార్బుల్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు

(Pataan:షారుఖ్-దీపికల దిష్టిబొమ్మలు దగ్ధం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -