end

హాయ్‌ బావా… నేనంటే ఇష్టం లేదా!

  • పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకున్న యువతి
  • వరకట్న వేధింపులే కారణమంటున్న నవనీత తల్లిదండ్రులు

‘హాయ్‌ బావా… నేనంటే నీకు ఇష్టం లేదు కదా! నాకంటే ముఖ్యమైన వాళ్లు నీకు వేరే ఉన్నారుగా! నాకు ప్రేమలో ఓడిపోవాలని లేదు బావా… నీకు ఇష్టమైన వాళ్లతో సంతోషంగా ఉండు… నేను ప్రేమలో ఓడిపోవాలనుకోవడం లేదు అందుకే తప్పుకుంటున్నాను… ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా నా చావు కబురు నీవు వింటావు… ఐ లవ్‌ యూ బావా … ఇక బై’ అంటూ కొత్తగా పెళ్లైన ఓ యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

లక్ష్మీనరసింహస్వామి రథం దగ్గం

కొల్చారం మండల కేంద్రం ఉప సర్పంచ్‌ నింగొల్ల లక్ష్మీ, చెన్నయ్యల కూతురు నవనీత(19) ఇంటర్‌ వరకు చదువుకొని ఇంటివద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన దూరపు బంధువులు అయిన ఆశన్నగారి లక్ష్మీ, మల్లేశంల కుమారుడు ప్రశాంత్‌ వరుసకు నవనీతకు బావ అవుతాడు. వీరిద్దురు కొన్నేళ్లుగా ఇష్టపడుతూ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ విషయం ఇరు వర్గాల ఇళ్లల్లో తెలిసి చాలా గొడవలు జరిగాయి. అయినా సరే నవనీత, ప్రశాంత్‌ ఇద్దరు వారి వారి పెద్దలను ఒప్పించి గత ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు.

1727 కిలోల గంజాయి పట్టివేత

అయితే గత రెండు మూడు నెలలుగా తరుచూ గొడవపడుతున్నారని దీంతో మృతురాలు నవనీత మానసికంగా కుంగిపోయి వేధనకు గురవుతుందని నవనీత తల్లిదండ్రులు తెలిపారు. ప్రశాంత్‌ తల్లిదండ్రులు తరుచూ కట్నం తేవాలని వేధించారని అందుకే తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని నవనీత తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మృతురాలు నవనీత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

భారత పౌరులను అపహరించిన చైనా బలగాలు

Exit mobile version