end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంసెల్ఫీఫోటో దిగబోయి వాగులో గల్లంతు...
- Advertisment -

సెల్ఫీఫోటో దిగబోయి వాగులో గల్లంతు…

- Advertisment -
- Advertisment -

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ఓ యువకుడు వాగు వద్ద సెల్ఫీ ఫోటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన మహబూబ్‌నరగ్‌ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన అఫ్రోజ్‌ (22) అనే యువకుడు లింగంపేట దుందుబి వాగుపై ఉన్న చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లాడు.

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు; మగ్గురు మృతి

ఆ తర్వాత సెల్ఫీదిగుదామని ప్రయత్నించగా వాగు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తోటి యువకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జడ్చర్ల సీఐ వీరాస్వామి, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుందుబి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లొద్దని, అలాగే వాగు పరివాహక ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు !?

నిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -